గూడూరును జిల్లా కేంద్రం చేయాలని ప్లకార్డులతో నిరసన

గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గత 213 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బుధవారం గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు జిల్లా సాధన సమితి నాయకుడు కంకణాల పెంచలనాయుడు ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని, అన్ని వనరులు పుష్కలంగా ఉన్న గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్