కుప్పంలో పర్యావరణ నియంత్రిత పౌల్ట్రీ ఫారం ప్రారంభించిన సీఎం

కుప్పం పర్యటనలో భాగంగా  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ నియంత్రిత పౌల్ట్రీ ఫారంను ఆదివారం  ప్రారంభించారు. ఆధునిక పౌల్ట్రీ షెడ్‌ను పరిశీలించి, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సాంకేతికతతో కోళ్ల ఆరోగ్యం మెరుగుపడి, ఉత్పత్తి పెరిగి, మరణాలు తగ్గుతాయని రైతులు వివరించారు. ఈ విధానంతో స్థిరమైన ఉత్పత్తి, అధిక ఆదాయం పొందవచ్చని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్