టీఆర్ కండ్రిగలో వెలసిన నేత్రప్రదాయణి దేశమ్మ దేవాలయ ఆదాయ వనరుల గుత్త హక్కుల వేలం ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 2025 ఆగష్టు 31వ తేదీ వరకు గుత్తహక్కులు కేటాయించే నిమిత్తం వేలం ఉంటుందన్నారు. తలనీలాలు పోగుచేసుకునే హక్కు, పార్కింగ్ హక్కులకు సీల్టు టెండరు ద్వారా, బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తామన్నారు.