సీజనల్ వ్యాధుల నియంత్రణతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయంలోని తన చాంబర్లో రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ ల కమిషనర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.