చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆదివారం పోలియో కార్యక్రమాన్ని వైద్య సభ్ యూనిట్ అధికారి జయశంకర్ ప్రారంభించారు. జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ చేతుల మీదుగా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. పుట్టిన శిశువు నుండి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో నివారణకు ఈ డ్రాప్స్ వేస్తున్నట్లు తెలిపారు. పోలియో చుక్కలు వేసిన పిల్లల వివరాలను ఆన్లైన్ యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు.