చిత్తూరు జిల్లా పలమనేరులోని కైగల్ జలపాతంలో రెండు రోజుల క్రితం సరదాగా ఈత కొడుతూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు యూనస్ మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని శనివారం వెలికితీశారు. ఈ ఘటన పలమనేరు నియోజకవర్గంలో విషాదాన్ని నింపింది.