చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో గురువారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేకపోయారు. అనంతరం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం కురవడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందామని ప్రజలు తెలియజేశారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ప్రజలు సురక్షితంగా ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు తెలియజేశారు.