ఈరోజు (మంగళవారం) ఏర్పడనున్న రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రంలో సంభవిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు గ్రహణ సమయంలో మూసివేస్తారు, అయితే శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో దర్శించుకుంటే రాహు-కేతు దోషాలు, నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గ్రహణం మధ్యాహ్నం సుమారు 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.