యువతి అదృశ్యం.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు..

ఏర్పేడు మండలం, ఎండి పుత్తూరు గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఏర్పేడు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తాము కూలి పనులకు వెళ్లామని పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చి చూసే సమయానికి తమ కుమార్తె ఇంటి వద్ద లేదని ఫిర్యాదుల పేర్కొన్నారు. బంధువుల ఇళ్ల వద్ద వెతికిన ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. వారి ఫిర్యాదుతో ఏర్పేడు సీఐ జయచంద్ర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్