బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, తన జన్మదినం సందర్భంగా శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రజాసేవలో మరింత అంకితభావంతో, వినయంతో ముందుకు సాగేందుకు స్వామివారి కృప, ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉండాలని ప్రార్థించినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.