AP: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం సౌకర్యాల కల్పనకు రూ.48 కోట్లు, భక్తుల సౌకర్యార్థం 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోద ముద్ర వేశారు.