AP: టీటీడీ పట్టు వస్త్రాల కొనుగోళ్ల స్కామ్పై జరుగుతున్న విజిలెన్స్ విచారణపై మాజీ మంత్రి రోజా స్పందించారు. 2015లో జరిగిన ఈ ఘటనను మాజీ సీఎం జగన్పై రుద్దడం దారుణమని, ఆధారాలు దాచి తమపై బురద చల్లడం సరికాదని ఆమె పేర్కొన్నారు. రాజా అనే వ్యక్తి టీడీపీకి చెందినవాడని, 2010-2015 మధ్య పట్టు వస్త్రాలు సరఫరా చేశాడని, విచారణ నివేదికలో 2015 అని స్పష్టంగా ఉందని రోజా వెల్లడించారు.