వెలిగొండ ప్రాజెక్టు పనులు 1996లో ప్రారంభం కాగా అప్పటి నుంచి కొనసాగుతున్నప్పటికీ ఇంకా పూర్తికాలేదని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం ప్రతి 15 రోజులకు ఓ సారి సమీక్ష చేస్తుండగా, 2026 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. తుఫాను వల్ల దెబ్బతిన్న ఫీడర్ కెనాల్పై రూ.456 కోట్ల టెండర్లు పిలిచామని, ఈ నెలలోనే పనులు మొదలవుతాయని తెలిపారు.