వీడియో.. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లిన మాధురి

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మళ్లీ రోడ్డుపైకి వచ్చింది. దువ్వాడ ఇంట్లోకి దివ్వెల మాధురి ప్రవేశించింది. దీంతో తన కూతుళ్లు, బంధువులతో ఆ ఇంట్లోకి వెళ్లేందుకు శ్రీనివాస్ భార్య వాణి సిద్ధమైంది. దీంతో పోలీసులకు, వాణి బంధువులకు తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ సీన్ మొత్తాన్ని దువ్వాడ‌ శ్రీను ఇంటి పైనుంచి సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది మాధురి. అయితే దివ్వెల మాధురికి మూడు రోజుల క్రిత‌మే దువ్వాడ ఇల్లు రాసిచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్