తిరుమల లడ్డూ కల్తీ వివాదం -బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

తిరుమలలో లడ్డూల కల్తీపై సమగ్ర దర్యాప్తు చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) అన్నారు. శనివారం బొబ్బిలి కోటలో ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని అన్నారు. స్వామివారి ప్రసాదాన్ని ప్రతిభక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించడంతో పాటు ప్రసాదాన్ని ఆత్మీయులకు పంచి పెడతారని తెలిపారు. అలాంటి స్వామివారి ప్రసాదం విషయంలో చిన్ని దోషమైనా క్షమించరానిదన్నారు.

సంబంధిత పోస్ట్