గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో సరస్వతి హోమం సోమవారం వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదుల భువనేశ్వర ప్రసాద్ శర్మ మూల నక్షత్రం సందర్భంగా విద్యాభివృద్ధికి క్షేమానికి సరస్వతి హోమం జరిపారు.