సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలు నిర్వహించాలి

గ్రామాలలో సమస్యలు పరిష్కారం కోసం విధిగా గ్రామ సభలు నిర్వహించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అంబళ్ల సుధారాణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వివిధ విభాగాల అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన అన్ని గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్