ఆంధ్రప్రదేశ్ తైక్వాండో జనరల్ సెక్రటరీ సిహెచ్. వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఉత్తరాంధ్ర తైక్వాండో ఛాంపియన్షిప్లో బొబ్బిలి విద్యార్థులు 2 సిల్వర్, 3 కాంస్య పతకాలు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. విజేతలను శాసనసభ్యుడు ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) బొబ్బిలి కోటలో అభినందిస్తూ, క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కోచ్ యాళ్ల భార్గవి శిక్షణ ఈ విజయాలకు దోహదపడిందని తెలిపారు.