బొబ్బిలి మండలం జగన్నాథవలసలో ఇంటి సందు స్థలం వివాదంలో కన్నం రమణమూర్తి అనే వృద్ధుడిని హత్య చేసినట్లు తెలిసింది. వంశీ అనే వ్యక్తి ఆన్లైన్లో కత్తి కొనుగోలు చేసి, పక్కా ప్రణాళికతో వృద్ధుడిపై దాడి చేశాడని, అతనిపై గంజాయి కేసు కూడా ఉందని సమాచారం. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.