తెర్లాం మండలం జాడావారి కొత్తవలసకు చెందిన సిద్ధును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం అభినందించి రూ.1 లక్ష అందించారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రతిరోజూ కాలేజీకి వెళ్లడం కష్టంగా మారిన సిద్ధు, పాఠశాల స్థాయిలో ఎటిఎల్ ద్వారా కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకొని, ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.