బొబ్బిలిలో రేపు హిందూ సమ్మేళనం

విజయనగరం జిల్లా మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు గోన మానస తెలిపారు, బొబ్బిలి రాజా కాలేజీ గ్రౌండ్‌లో రేపు (ఆదివారం) సాయంత్రం 3 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనానికి హిందూ సమాజానికి చెందిన ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ విలువలు, సనాతన ధర్మ ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ సమ్మేళనం ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమానికి ఘన విజయాన్ని చేకూర్చాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్