జేఈఈ అడ్వాన్స్డ్-2026లో కాంతా హిమకర్ ఆల్ ఇండియా 40వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ముంబై ఐఐటీలో చేరి భవిష్యత్తులో అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ కావాలన్నది తన లక్ష్యమని హిమకర్ తెలిపారు. తండ్రి పంచాయతీ కార్యదర్శి, తల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. బొబ్బిలి, విశాఖపట్నం, విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసిన హిమకర్ పదో తరగతిలో 590, ఇంటర్లో 985 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని కృతజ్ఞతలు తెలిపాడు.