వైసీపీ పార్టీ శాసనమండలి ప్రతిపక్షనాయకులు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆదేశాల మేరకు, చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ శ్రేణులు ఆంధ్రజ్యోతి ఛానెల్ లోని 'తొలిపలుకులు' కార్యక్రమంలో వై.యస్ జగన్మోహన్ రెడ్డి, వైస్సార్ పార్టీ నాయకులు, వారి భార్యలు, రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి పత్రిక రాధాకృష్ణపై చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు.