ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గజపతినగరంలోని సీతారామ శ్రీ వెంకటేశ్వర గ్రూపు దేవాలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నవనీత సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు పీస పాటి శ్రీనివాసాచార్యులు తెల్లవారుజామున సుప్రభాత సేవ, సేవా కాలం తదితర కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.