విజయనగరం జిల్లా పదో తరగతి పరీక్షల్లో 91.08 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విజయంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. పటిష్ట ప్రణాళిక, సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో మెరుగైన ఫలితాలు సాధించాలని, ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలని సూచించారు.