కురుపాం మండలంలో జరిగిన వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ అజెండా అని చెప్పారు. రైతులు తమ పంటను మార్కెట్యార్డుకి తేచి గిట్టుబాటు ధర పొందాలన్నారు. కళావతి ఛైర్పర్సన్గా, గౌరీశంకరరావు వైస్చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.