పార్వతీపురం: జీడి ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించిన కలెక్టర్

పార్వతీపురంలో గల జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ ను మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ప్రాసెసింగ్ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాసెసింగ్ ను మంచి నాణ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నాణ్యత ప్రమాణాలు చక్కగా ఉండటం వలన మార్కెట్ లో ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా మార్కెటింగ్ కు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్