మన్యం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు ఆరోగ్య సర్వేలను పారదర్శకంగా నిర్వహించి వ్యాధులను ముందుగానే గుర్తించాలని సూచించారు. భామిని పీహెచ్సీని సందర్శించి, అందుబాటులో ఉన్న సేవలు, మందులు, పరీక్షలపై సమీక్షించారు. తల్లిపాలు, కాంప్లిమెంటరీ ఫీడింగ్పై అవగాహన పెంచాలని, ఆర్బిఎస్కే, ఎన్సిడి, టిబి, ఫీవర్ సర్వేలను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.