వంగర: గ్రామ పంచాయతీ పురోగతి సూచిక 2.0పై శిక్షణ కార్యక్రమం

వంగర ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ సురేశ్ ముఖర్జీ అధ్యక్షతన ఎంపీడీఓ రఘునాథచారి ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి సూచిక 2.0పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పేదరికం లేని మెరుగైన జీవనోపాధులు, ఆరోగ్యం, నీరు సమృద్ధి, పచ్చదనం పరిశుభ్రత వంటి 9 అంశాలపై శిక్షణ ఇచ్చారు. సుపరిపాలన కలిగిన గ్రామపంచాయతీలుగా ఉండేందుకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. ఈ శిక్షణలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్