ఆషాఢ మాసం ప్రారంభంతో గ్రామదేవతలకు పూజలు జరపడం ఆనవాయితీగా ఉంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా తెర్లాం మండలం టెక్కలివలసలో మహిళలు దుర్గమ్మతల్లికి చీరలు, సారే సమర్పించి పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం అర్పించారు. అనంతరం హారతి ఇచ్చి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.