సాలూరు పట్టణంలో బుధవారం కార్తీకపౌర్ణమి సందర్భంగా అయ్యప్ప మాలాధారణ చేసిన భక్తులు పాల కావిళ్లతో ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో గురుస్వాముల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భజనలు, భక్తి గీతాలు ఆలపించారు. ఈ ఊరేగింపుతో కార్యక్రమం విజయవంతమైంది.