విజయనగరం జిల్లాలో న్యూఇయర్ వేడుకల వేళ విషాదం నెలకొంది. కొత్తవలస (M) పాత సుంకరపాలెం గ్రామానికి చెందిన కే.నాగేశ్వరరావు (30) IIFCలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న రాత్రి ఆఫీసు లావాదేవీలు ముగించుకుని తన ఏడాదిన్నర పాపతో న్యూఇయర్ వేడుకలు చేసుకునేందుకు ఎంతో ఆశగా కేకుతో ఇంటికి బయలుదేరాడు. అయితే అర్ధానపాలెం వద్ద అర్ధరాత్రి లారీ రూపంలో మృత్యువు అతడిని కాటేసింది.