ఎల్కోట మండలంలోని కిత్తన్నపేటలో ఆదివారం జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని తెలిపారు