విజయనగరం 42వ డివిజన్, కామాక్షినగర్లోని మండల పరిషత్ పాఠశాలలో గురువారం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎ.ఎస్. ప్రకాశరావు సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా విద్యార్థుల విద్యాభివృద్ధికి మద్దతిస్తున్నామని తెలిపారు.