వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. దాదాపు 3 గంటలు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..రాజకీయ ప్రేరేపితంగానే తనపై కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. కేవీ రావుతో సంబంధంపై ప్రశ్నించగా ముఖ పరిచయం తప్ప పెద్దగా పరిచయం లేదని చెప్పానన్నారు. అలాగే విక్రాంత్ రెడ్డి గురించి కూడా పలు ప్రశ్నలు అడిగినట్లు మీడియాకు వెల్లడించారు.