AP: విశాఖ డేటా సెంటర్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు క్రెడిట్ గత వైసీపీ ప్రభుత్వానిదేనని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్ హయాంలోనే అదానీ గ్రూప్కు 130 ఎకరాల భూమి కేటాయించామని, 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్గా మార్చేందుకు తాము పునాదులు వేశామని అన్నారు. రూ.6,400 కోట్లతో సాగర్ మాల కింద బీచ్ రోడ్డు నిర్మాణానికి ప్రకటన చేశామని, కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందన్నారు.