మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి

ఈనెల 30న విశాఖలోని మధురవాడ సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎంవిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న భీమిలి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 70 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్