జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రక్తదానం చేసిన యాదవ్, పవన్ను "అరాచక వైఎస్సార్సీపీ పాలనను అంతం చేసిన ధీరుడు" అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్కు పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.