ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ బుధవారం వరకు విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో అత్యంత వినోదాత్మకంగా నిర్వహిస్తామని బీజేపీ రాజ్యసభ మాజీ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ పండుగ వేడుకల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం శుక్రవారం ఎయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు వినోదాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.