విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని పీఓడబ్ల్యూ మహిళా సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే దీక్షలు చేస్తున్నవారికి సంఘీభావం ప్రకటించింది. పీఓడబ్ల్యూ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామన్నారు.