అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని పార్వతీపురం గ్రామం నుండి బుధవారం అన్నవరంలో జరుగు గిరి ప్రదర్శనకు వెళ్తున్న పదిమంది ప్రయాణికులతో కూడిన ఆటో తేటగుంట సమీపంలో కుక్కను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ప్రయాణికులు గాయపడగా, వారిని 108 వాహనంలో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నర్సీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ రాజాన వీర సూర్యచంద్ర, నాతవరం జనసేన మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణతో కలిసి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.