చలో విశాఖ బహిరంగ సభకు సీఐటీయూ పిలుపు

విశాఖలో జనవరి 4న జరిగే చలో విశాఖ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం పరవాడ ఫార్మా సిటీలో ఈ సభను విజయవంతం చేయడానికి ర్యాలీ నిర్వహించారు. సిఐటియు 18వ అఖిలభారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్నాయి. 55 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఈ మహాసభలకు వేదిక కానుంది.

సంబంధిత పోస్ట్