అనకాపల్లిలో లంకెలపాలెం జంక్షన్లో మరోసారి ట్రైలర్ లారీ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గాజువాక నుంచి అనకాపల్లి వైపు ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ రాంగ్ రూట్లో వచ్చి మూడు వాహనాలను ఢీకొంది. ఇటీవల ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మళ్లీ ఇలాంటి ఘటన జరగడంతో వాహనదారుల్లో భయం, ఆందోళన నెలకొంది.