స్థానిక ఏఎంఏఎల్ కళాశాలలో మలబార్ గోల్డ్ (అనకాపల్లి శాఖ) ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా తొమ్మిది మంది విద్యార్థినులకు రూ. 64 వేల ఆర్థిక సహాయంతో మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. రాబోయే విద్యా సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని మలబార్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.