డుంబ్రిగూడ మండలం పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండలు కొనసాగినా, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారి గాలివాన ప్రారంభమైంది. గత వారం రోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. వర్షంతో వాతావరణం చల్లబడగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.