అనంతగిరి మండలంలోని మలుంగుమ్మి జలపాతంలో సెల్ఫీ సరదా విషాదంగా మారింది. గురువారం మధ్యాహ్నం జంబువలసకు చెందిన నలుగురు యువతులు ఫోటోలు దిగేందుకు వెళ్లగా, జలపాతంలో జారి ముగ్గురు మృతి చెందారు. మరో యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.