శనివారం బొర్రా కటిక జలపాతం వద్ద దేశ నలుమూలల నుండి పర్యాటకులు తరలివచ్చి సందడి చేశారు. మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో మూతబడ్డ జలపాతాలు, పర్యాటక ప్రదేశాలు శనివారం నుండి యధావిధిగా పునఃప్రారంభమయ్యాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకుల రాకతో జలపాతం వద్ద సందడి నెలకొంది.