గిరిజన ఉపాధ్యాయుల సదస్సుకు యుటిఎఫ్ పిలుపు

రాష్ట్రస్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని డుంబ్రిగూడ యుటిఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 12న రంపచోడవరం లో 6వ రాష్ట్రస్థాయి గిరిజన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమ, జిపిఎస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కనీస వసతుల లేమి, అదనపు బాధ్యతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో విద్యార్థుల సంరక్షణ కూడా ఉపాధ్యాయులపైనే పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్