విశాఖ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో 93.1 శాతం ఉత్తీర్ణత సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 73 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 50 మంది ప్రథమ శ్రేణిలో నిలిచారు. తొంపల తులసి (561), వరుణ్ సందేశ్ (558) అత్యధిక మార్కులు సాధించారు. 13 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేసి, విద్యార్థులను అభినందించారు.