ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరిగింది. ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు ముఖ్య అతిథిగా హాజరై, నిరుద్యోగులకు ఈ కార్యక్రమాలు ఉపయోగకరమని తెలిపారు. జిల్లా ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, 11 ఎమ్మెన్సీ కంపెనీలు హాజరైన ఈ మేళాలో 265 మంది హాజరుకాగా, 106 మంది ఎంపికయ్యారని వెల్లడించారు.